తిరుపతి, మే 24: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.శ్రీ వారి ఆలయానికి చేరుకున్న అదనపు ఇఓ ఏవీ ధర్మరెడ్డి స్పీకర్ను ఆలయ గౌరవాలతో స్వాగతించారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.
తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదనిర్వచనం చేశారు. ఆశీర్వచనం తరువాత ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ డిప్యూటీ ఈవో హరిద్రనాథ్,తదితరులు పాల్గొన్నారు.