నిజామాబాద్ : తెలంగాణ ప్రజల గుండె చప్పుడు టీఆర్ఎస్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. నిజామాబాద్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ నూతన కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశవ్యాప్తంగా తెలియజేస్తూ, నిరంతం ప్రజల కోసం పనిచేస్తున్నామని ఎమ్మెల్సీ తెలిపారు.
ప్రజల ఆశీస్సులతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామంలోని కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు. కార్యాలయాల్లో ఉండే సిబ్బంది, ఇన్సూరెన్స్ లాంటి అనేక అంశాల్లో కార్యకర్తలకు సహాయసహకారాలు అందిస్తారని కవిత పేర్కొన్నారు. అంతేకాదు దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీల్లో ఒకటిగా టీఆర్ఎస్ నిలిచిందన్నారు.
క్యాంపు కార్యాలయంలో అనేకమంది కార్యకర్తలు, ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీని కలిసారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించిన ఎమ్మెల్సీ కవిత వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్, బోర్గాం పి.గ్రామంలో ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్లు ఉమారాణి, సాయరాం, జర్నలిస్టు బాలులను ఎమ్మెల్సీ పరామర్శించారు.
అన్నదానం అభినందనీయం..
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత భోజన వితరణ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేపట్టిన ఉచిత అన్నదానం ఎంతోమందికి ఉపయోగపడిందన్నారు. మరికొద్ది రోజులు కరోనా పట్ల అప్రమత్తత అవసరమన్నారు.
అనంతరం ఫులాంగ్ చౌరస్తా లోని పులాంగ్ పార్క్ ని సందర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ నీతూ కిరణ్, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్