హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్లోని ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. గ్రీన్చాలెంజ్ దేశవ్యాప్తంగా హరిత విప్లవం తీసుకొస్తున్నదని కొప్పుల తెలిపారు. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీలు సంతోష్కుమార్, బొర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు కొప్పులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.