హేమలతాశేఖర్గౌడ్, ఫుడ్స్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి అన్నారు. మనోహరాబాద్లో నూతనంగా నిర్మించిన రైతువేదికను మంగళవారం అట్టహాసంగా ప్రారంభించారు. రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతువేదికల్లో నిల్వ ఉంచేలా చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసి లారీల యజమానులతో మాట్లాడి ధాన్యాన్ని తరలించేందుకు కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంచనాలకు మించి ధాన్యం దిగుబడి రావడంతో రైస్మిల్లుల వద్ద ధాన్యం నింపిన లారీలు బారులు తీరాయన్నారు. ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోవడంతో కొనుగోలు చేయాల్సిన ధాన్యం కేంద్రాల వద్దనే ఉండిపోతుందన్నారు. ఈ విషయమై ప్రత్యేక చొరువ చూపడం జరిగిందన్నారు. లారీలు మిగతా కేంద్రాల వద్దకు వెళ్లి ధాన్యాన్ని రవాణా చేసేందుకు వీలుగా లోడ్ లారీల ధాన్యాన్ని రైతువేదికల్లో నిల్వ చేయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, తహసీల్దార్ భిక్షపతి, నాయకులు ఇమాంపూర్ శేఖర్గౌడ్, వెంకట్గౌడ్ పాల్గొన్నారు.
రైతులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
తూప్రాన్ రూరల్, మే 18 :రైతులు ఆర్థికంగా అన్ని రం గాల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి అన్నారు. మం గళవారం తూప్రాన్ పట్టణ శివారులోని అల్లాపూర్ వద్ద 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం బస్తాలను నిల్వ ఉంచడం కోసం వాహ నాల నుంచి హమాలీలతో దింపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవ సరం లేదని, ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుం దన్నారు. ఆయన వెంట వివిధ గ్రామాలకు చెందిన రైతులు, హమాలీలు ఉన్నారు.