భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన భర్తను నరికి చంపిందో ఇళ్లాలు. జిల్లాలోని మహాముత్తారం మండలం కొరకుంటలో భర్త ఇనుముల కిష్టయ్య రోజు తాగివచ్చి తన భార్యను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి కూడా భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. భర్తతో విసిగిపోయిన భార్య అతన్ని నరికి చంపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.