తిరువనంతపురం: కేరళలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత రెండు వారాలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. అయితే ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 7,798 కరోనా కేసులు, 100 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,73,134కు, మొత్తం మరణాల సంఖ్య 14,686కు పెరిగింది. కాగా, గత 24 గంటల్లో 11,447 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 29,46,870కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,11,093 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు వెల్లడించింది.