హైదరాబాద్ : గోల్డెన్జూబ్లీ హోటల్స్పై సీబీఐ కేసు నమోదు చేసింది. రుణాల పేరుతో రూ.1,285 కోట్లు మోసం చేసినట్లుగా గోల్డెన్జూబ్లీ హోటల్స్పై అభియోగం. బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా 6 బ్యాంకులను మోసం చేసినట్లు అభియోగం నమోదైంది. దీంతో సంస్థ ఎండీ లక్ష్మీనారాయణశర్మ, డైరెక్టర్లు అర్జున్సింగ్, ఒబెరాయ్, నేహా గంభీర్, యశ్దీప్ శర్మలపై సీబీఐ కేసు నమోదు చేసింది.