హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ప్లాస్మాథెరపీ.. కొవిడ్రోగుల పాలిట సంజీవని. వైరస్ మహమ్మారితో చావు చివరి అంచులదాకా వెళ్లినవారు కూడా ప్లాస్మాథెరపీతో ఆరోగ్యంగా తిరిగొచ్చిన ఉదంతాలు అనేకం. ప్లాస్మా వినియోగం ఇటీవల పెరిగింది. కొవిడ్ రెండోదశ విజృంభిస్తున్న సమయంలో ప్లాస్మా దాతల కోసం వెదుకులాట ముమ్మరమైంది. సోషల్మీడియా సహా ఎక్కడ వెదికినా ప్లాస్మాదాతల కోసం అభ్యర్థనలే అధికంగా కనినిపిస్తున్నాయి. కొవిడ్నుంచి కోలుకున్నవారు మాత్రమే ప్లాస్మాను దానంచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిని సమకూర్చేందుకు హైదరాబాద్లో పలువురు వ్యక్తులు, సంస్థలు ముందుకొస్తున్నాయి. సకాలంలో ప్లాస్మాను అం దిస్తూ ప్రాణాలను నిలబెడుతున్నాయి. ఒక్క ఫోన్ చేస్తే చాలు ఉచితంగా దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. బ్లడ్బ్యాంకులు సైతం ప్లాస్మా యజ్ఞంలో మేము సైతం అంటూ ముందుకొస్తున్నాయి.