మెదక్ మున్సిపాలిటీ, మే 4: కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి సూచించారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో హైపోక్లోరైట్ రసాయనం పిచికారీని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు తగి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జనసంచార తో పాటు రద్దీ ప్రాంతాలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, కాలానీలు, బస్తీలలో హైపోక్లోరైట్ రసాయనాన్ని పిచికారీ చేస్తున్నమన్నారు.
చెత్తను రోడ్డుపై వేయరాదు..
చెత్తను రోడ్లపై వేయొద్దని కమిషనర్ పట్టణ ప్రజలకు సూచించారు. మున్సిపల్ చెత్త వాహనాల్లో తడి, పోడి చెత్తను వేరు చేసి వేయాలన్నారు రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
11 వరకు లాక్డౌన్ …..
కరోనా నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఈనెల ఏప్రిల్ 26 నుంచి మే 4 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద యం 6 వరకు విధించిన లాక్డౌన్ను ఈ నెల 11 వరకు పొడిగిస్తున్నట్లు మున్సి పల్ చైర్మన్ చంద్రపాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా ఆరికట్టడానికి వర్త క, వ్యాపార వాణిజ్య ప్రతినిధుల స మ్మతితో లాక్డౌన్ను పొడిగిస్తున్నామన్నారు. నిబంధనలు ఉల్లఘించి దుకాణాలు తెరిస్తే సీజ్ చేసి జరిమానాలు విధిస్తామని చైర్మన్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో లాక్డౌన్ ఏడో రోజుకు చేరుకున్నది. అత్యవసర సేవలకు మినహా మిగతా దుకాణాలు మూసివేయడంతో ప్రధాన రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి.
రేగోడ్లో కొనసాగుతున్న లాక్డౌన్
రేగోడ్, మే 4: కరోనా నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రేగోడ్లో కొనసాగుతున్న లాక్డౌన్ వారం రోజులకు చేరుకున్నది. 29 నుంచి విధించిన లాక్డౌన్తో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు దుకాణాలు, హోటళ్లను యజమానులు తెరిచి ఉంచుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఉదయం వరకు వ్యాపార , వాణిజ్య మూసివేసి ఉంటాయి. అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. రేగోడ్తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉండడంతో తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం తో ప్రజలు మధ్యాహ్నం నుంచి ఇండ్లకు పరిమితమవుతున్నారు. లాక్డౌన్కు ప్రజలంతా సహకరించాలని నాయకులు, అధికారులు కోరుతున్నారు.