ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త ఫోన్ స్పార్క్ 7Tని శుక్రవారం భారత్లో ఆవిష్కరించింది. ఎంట్రీ లెవల్లో విడుదలైన ఫోన్ ధర 10వేల లోపే. బడ్జెట్ విభాగంలో రిలీజ్ అయిన ఫోన్లో మంచి ఫీచర్లు ఉన్నాయి. జూన్ 15 నుంచి ఫోన్ను కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ కలిగిన ఏకైక మోడల్ ధర రూ.8,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ జ్యువెల్ బ్లూ, మాగ్నెట్ బ్లాక్, నెబ్యూలా ఆరెంజ్ కలర్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ను జూన్ 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. సేల్ మొదటిరోజు కొనుగోలు చేస్తే రూ.1000 వరకు తగ్గింపు వర్తించనుంది.
డిస్ప్లే: 6.52 అంగుళాలు
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35
ఫ్రంట్ కెమెరా: 8 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 48 మెగా పిక్సెల్
ర్యామ్: 4జీబీ
స్టోరేజ్: 64జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 6000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11