మేడ్చల్ మల్కాజిగగిరి : జిల్లాలోని శామీర్పేట చెరువులో మహిళా మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసు కథనం ప్రకారం… యాప్రాల్కు చెందిన నాగమణికి(40) భర్త గోపాల్, ఇద్దరు సంతానం ఉన్నారు. కొంత కాలంగా భర్త మద్యానికి బానిస కావడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
మద్యం మానాలని భర్తకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. కాగా, గురువారం మధ్యాహ్నం తను పనిచేస్తున్న దగ్గర నుంచి ఎవరికి సమాచారం ఇవ్వకుండా నాగమణి వచ్చేసింది. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
కాగా, శుక్రవారం ఆమె సెల్ఫోన్కు కుటుం సభ్యులు కాల్ చేయగా.. స్థానికంగా రాయిపని చేసుకుంటున్న వారు ఆ ఫోన్లో మాట్లాడారు. శామీర్పేట చెరువులో బండమీద సెల్ఫోన్ ఉందని ఎవరు కనిపించడం లేదన్నారు.
వెంటనే కుటుంబీకులు శామీర్పేట చెరువుకు చేరుకుని గజ ఈతగాళ్లతో వెతికించగా మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి
బీచ్లో శ్రద్దాదాస్ షికార్లు..ఫొటోలు వైరల్
త్వరలో టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం : మంత్రి ఎర్రబెల్లి
మాస్క్ ధరించాలని పోలీసుల ప్రచారం
గిరిజన మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తున్న సీఎం కేసీఆర్