కరోనానుంచి కోలుకున్నవారిలోనూ వైరస్ జాడలు..!తాజా అధ్యయనం

లండన్: కొవిడ్-19 వ్యాప్తి ప్రారంభమైననాటినుంచి వైరస్ గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. ఇటీవల ఓ అధ్యయనంలో విస్తుగొలిపే విషయం తెలిసింది. కరోనా ఒక్కసారి వచ్చిపోతే మళ్లీ రాదని అంతా నమ్ముతున్నారు. అయితే, కరోనా నుంచి కోలుకున్నవారిలోనూ వైరస్ జాడలు కనిపిస్తున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. కరోనా నుంచి కోలుకున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఇతరులతో సన్నిహితంగా ఉండకూడదని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఈ పరిశోధనా ఫలితాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ప్రచురితమయ్యాయి.
పరిశోధకులు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాలకు అనుగుణంగా 131 మంది కరోనా వచ్చి కోలుకున్నవారిపై అధ్యయనం చేశారు. దగ్గు, అలసట, విరేచనాలు, తలనొప్పి, వాసన లోపాలు, ఆకలి లేకపోవడం, గొంతు నొప్పి, రినిటిస్ లాంటి కొవిడ్ -19 కు సంబంధించిన లక్షణాలు, సంకేతాల నిలకడపై దృష్టి పెట్టి జనాభా, వైద్య, క్లినికల్ సమాచారం సేకరించారు. వారికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 16.7 శాతం మందికి మళ్లీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే,వారిలో ఎవరికీ జ్వరం లేదని, ఆరోగ్యస్థితిలోనూ మెరుగుదల ఉందని గుర్తించారు. అయితే, వీరిలో గొంతునొప్పి, రినిటిస్ (జలుబు సంబంధిత) లక్షణాలున్నట్లు తేల్చారు. కొవిడ్నుంచి కోలుకున్నవారిలో ఈ లక్షణాలు దీర్ఘకాలికంగా ఉంటే అశ్రద్ధ చేయొద్దని, వీరిపై నిరంతర పర్యవేక్షణ అవసరమని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇటలీలోని కాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ సేక్రేడ్ హార్ట్ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో లాండి చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ప్రపంచంలోనే అత్యధిక కార్లు విక్రయించిన కంపెనీ ఇదే..!
- సోనూసూద్ కోసం 2 వేల కి.మీ సైక్లింగ్..!
- డాలర్ జాబ్లపై మోజు ఎందుకంటే!
- కొవిడ్ - 19 : రెండు రాష్ట్రాల్లోనే 67 శాతం కేసులు
- జైష్ ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
- పోషకాహార లోప నివారణ ప్రతిపాదనల అమలుకు సిద్ధం
- కాఫీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
- రాష్ట్రంలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడమే ధ్యేయం : మంత్రి సత్యవతి రాథోడ్
- ప్రియురాలిని కలిసేందుకు వెళ్లి.. పాక్ రేంజర్స్కు చిక్కి
- క్రికెట్ ఆడిన ఆయుష్మాన్..చిన్నారుల చీర్స్ వీడియో