కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడిన ఘటనపై స్థానిక పోలీసులు ప్రాథమిక విచారణ పూర్తి చేశారు. ఇది దాడి కాదు.. ప్రమాదమే అయి ఉండే అవకాశాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఎన్నికల సంఘానికి ఈ మేరకు ప్రాథమిక విచారణకు సంబంధించిన రిపోర్ట్ అందించారు. విచారణ బృందం ఘటన జరిగిన ప్రాంతంలో సాక్ష్యాధారాలు సేకరించడంతోపాటు ప్రత్యక్ష సాక్షులను విచారించే పనిలో ఉంది. అయితే సీఎం భద్రత వ్యవహారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మమతను కలవడానికి వచ్చిన ప్రజలను సరిగా హ్యాండిల్ చేయలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి.