హైదరాబాద్ : జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ తొలిరోజు సిద్దిపేటకు వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి హరీశ్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఎకరం విస్తీర్ణంలో రూ. 4 కోట్ల నిధులతో ఆధునిక సదుపాయాలతో (జీ ప్లస్ వన్)గా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో కార్యాలయం, మొదటి అంతస్తులో నివాస సముదాయం ఉంటుంది. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.