గత కొన్ని రోజుల నుంచి సామ్సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ మోడల్ స్మార్ట్ఫోన్ లాంచ్ గురించే చర్చ నడుస్తోంది. హైఎండ్ ఫీచర్లతో ఈ ఫోన్ త్వరలో ఇండియా మార్కెట్లోకి విడుదల కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సామ్సంగ్.. గెలాక్సీ సిరీస్లో ఎస్21 5జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది.
దానికి అప్గ్రేడ్ వర్షన్గా ఎస్21 ఎఫ్ఈ ఫోన్ను సామ్సంగ్ తీసుకురానుంది. అయితే.. ఈ మోడల్ ఫోన్ బేసిక్ డిటెయిల్స్ మాత్రం ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. దాని డిజైన్, ఇంటర్ఫేస్కు సంబంధించిన ఫీచర్స్ స్మార్ట్ఫోన్ ప్రియులను బాగా ఆకర్షిస్తున్నాయి.
సామ్సంగ్.. గెలాక్సీ సిరీస్లో భాగంగా ఆప్టికల్ ఇమేజ్ స్టబిలైజేషన్(ఓఐఎస్) అనే స్టాండర్డ్ ఫీచర్ను తీసుకొస్తోంది. ఎక్సినోస్ 2100 ఎస్వోసీ ప్రాసెసర్తో ఈ మోడల్ ఫోన్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, ఫ్లాట్ డిస్ప్లే లాంటి ఫీచర్స్తో ఇది రానుంది. సెప్టెంబర్ 8 నే ఈ ఫోన్ విడుదలవుతుందని వార్తలు వస్తున్నా.. సామ్సంగ్ నుంచి ఇప్పటి వరకు ఈ ఫోన్ లాంచ్కు సంబంధించిన ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడికాలేదు.
అలాగే.. ఓఐఎస్ ఫీచర్ను గెలాక్సీ ఏ సిరీస్ అన్ని మోడల్ ఫోన్లలో 2022 లోపు సామ్సంగ్ యాడ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఓఐఎస్ ఫీచర్ వల్ల.. వీడియో క్వాలిటీ, ఫోటో క్వాలిటీ పెరుగుతుంది. ఫోటోలు, వీడియోలు తీసేటప్పుడు ఫోన్ షేక్ కాదు. అలాగే.. ఇది గైరో సెన్సార్ను ఉపయోగించుకొని బెస్ట్ క్వాలిటీ మీడియాను అందిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Realme Pad : రియల్మీ నుంచి తొలి ట్యాబ్.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
Redmi Earbuds 3 Pro : 30 గంటల బ్యాటరీ లైఫ్తో రెడ్మీ ఇయర్బడ్స్ 3 ప్రో విడుదల