సామ్సంగ్ ఇప్పటికే తన గెలాక్సీ సిరీస్లో భాగంగా.. జెడ్ ఫోల్డ్ 3, జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డబుల్ ఫోన్లను ఇటీవలే విడుదల చేసింది. ఆ ఫోన్లను మడత పెట్టుకొని జేబులో పెట్టుకోవచ్చు. అయితే.. సామ్సంగ్ గెలాక్సీ సిరీస్లో ఎమ్32 5జీ ఫోన్ను త్వరలోనే విడుదల చేయనుంది.
ఇప్పటికే ఈ ఫోన్ను త్వరలో భారత మార్కెట్లోకి విడుదల చేస్తామని సామ్సంగ్ ప్రకటించింది. తాజాగా ఈ ఫోన్ను 25 ఆగస్టున రిలీజ్ చేస్తామని వెల్లడించింది. గెలాక్సీ ఎం35 సిరీస్లో 4జీ ఫోన్ ఇప్పటికే రిలీజ్ అయింది. జులైలో 4జీ ఫోన్ను రిలీజ్ చేశారు. తాజాగా ఎం35 5జీ ఆధారిత ఫోన్ విడుదల కానుంది.
ఎం32 5జీ ఫోన్.. రీఫ్రెష్ డిజైన్తో క్వాడ్ రేర్ కెమెరాలతో లభించనుంది. ఫ్రంట్ ప్యానెల్ వాటర్ డ్రాప్ స్టైల్ ఫీచర్ ఉంటుంది. అది సెల్ఫీ కెమెరాను అద్భుతంగా చిత్రీకరిస్తుంది.
బ్లాక్, బ్లూ కలర్స్ వేరియంట్లలో 6.5 ఇంచ్ డిస్ప్లేతో ఈ ఫోన్ విడుదల కానుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ సపోర్ట్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 720 చిప్సెట్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది.
ఇప్పటికే గెలాక్సీ సిరీస్లో ఎమ్ 42 5జీ ఫోన్ మార్కెట్లో విడుదలైంది. ఎమ్ సిరీస్ అంటేనే బడ్జెట్ ఫోన్లకు కేరాఫ్ అడ్రస్. అందుకే అదే బడ్జెట్ ప్రైస్లో ఎమ్32 5జీ ఫోన్ను అందిస్తున్నారు. దీని ధర 25 వేల రూపాయల లోపే ఉండనుందని తెలుస్తోంది.
మార్కట్లో ప్రస్తుతం అందుబాటు ధరల్లో ఉన్న ఇతర బ్రాండ్ 5జీ స్మార్ట్ఫోన్లు రియల్మీ 8 5జీ, పోకో ఎమ్3 ప్రో 5జీ, వన్ప్లస్ నోర్డ్ సీఈ 5జీ ఫోన్లకు పోటీగా ఈ ఫోన్ను సామ్సంగ్ విడుదల చేస్తోంది.