వికారాబాద్, మే 10, (నమస్తే తెలంగాణ): తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల బియ్యం ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మే, జూన్ మాసాల్లో బియ్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ పౌరసరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 2లక్షల 34వేల 500 రేషన్ కార్డులు ఉన్నాయి. 588 రేషన్ దుకాణాలు ఉన్నాయి. కరోనా కారణంగా కూలి పనులు లేక, వ్యాపారాలు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. రేషన్ దుకాణాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో దాదాపు 7 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కరోనా నిబంధనల మేరకు 5వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టోకెన్లు ఇచ్చి రోజుకు కొందరికి మాత్రమే బియ్యం ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఓటీపీ.. ఐరిష్తో ఇబ్బందిగా..
రేషన్కు ఆధార్ నంబర్ అనుసంధానం చేయడంతో వినియోగదారుడికి సెల్ ఫోన్కు ఓటీపీ వస్తుంది. లేదంటే కండ్ల స్కానింగ్ ఐరిస్ పద్ధతితో బియ్యం పొందే అవకాశం ఉన్నది. కానీ కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బియ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
భౌతిక దూరం పాటించేలా చర్యలు..