కోవిడ్ తో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ప్రజలందరూ వ్యాక్సిన్ వేయించుకోమని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. అటు చైనా కూడా ఈ వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు టీకాలు వేయించుకోమని చెబుతున్నా పట్టించుకోవడం లేదు.
ఓ వైపుఫార్మా కంపెనీలు సిద్ధంగా ఉన్నా చైనీయులు మాత్రం టీకా వేయించుకోవడానికి ముందుకురావడం లేదు. దీంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ప్రజలందరూ టీకాలు వేయించుకునేలా ప్రోత్సాహకాలు ప్రకటించింది.
గుడ్లు ఫ్రీ అని ప్రకటించింది. అలాగే స్టోర్ కూపన్లు, రేషన్ పై డిస్కౌంట్లు ఇస్తోంది. వాక్సిన్ వేయించుకున్న వారికి బీజింగ్ హెల్త్ సెంటర్ లో దాదాపు 3 కెజీల గుడ్లను ఉచితంగా అందిస్తున్నారు. అలాగే షాంఘై వంటినగరాల్లో షాపింగ్ మాల్స్, ప్రార్థనాలయాల్లో సైతం ఆఫర్లు వర్తింపచేస్తున్నారు.
ఇప్పటివరకు 19 కోట్ల మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. మరి మిగిలిన 100కోట్ల మంది ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అంతవరకు ఈ ఆఫర్లను ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.