జనగామ : జిల్లాలోని లింగాల ఘన్పూర్ మండలం కల్లెం గ్రామంలో కరోనా కలకలం సృష్టిస్తుంది. గ్రామానికి చెందిన చిలుక లచ్చయ్య (80), బుచ్చమ్మ (76) అనే వృద్ధ దంపతులు రెండు రోజుల వ్యవధిలో మహమ్మారి సోకి మృత్యువాత పడ్డారు. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు దంపతుల ఇంటి పరిసర కాలనీకి చెందిన 150 మంది పరీక్షలు చేయించుకున్నారు.
దీంతో 71 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు అత్యవసర సమావేశం నిర్వహించి ఆదివారం నుంచి స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించుకొని అమలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు