పాట్నా: బీహార్కు చెందిన ఆర్జేడీ నేతలు తేజస్వి యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్తో సహా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలపై బుధవారం కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఈ మేరకు వారిపై చర్యలు చేపట్టారు. బీహార్ రాష్ట్ర పోలీసులకు మరిన్ని అధికారాలు కల్పించే బీహార్ ప్రత్యేక సాయుధ పోలీస్ బిల్లు మంగళవారం అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేతలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో ఆర్జేడీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ను మార్షల్స్ బలవంతంగా స్ట్రెచర్పై సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులతో ఘర్షణకు దిగిన తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్తోపాటు ఆర్జేడీ నేతలపై బుధవారం కేసు నమోదు చేశారు.