చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మీ త్వరలోనే ట్యాబ్స్ను విడుదల చేయనుంది. ఇప్పటికే రియల్మీ కంపెనీ నుంచి ట్యాబ్లెల్స్ విడుదల చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9న ట్యాబ్ను విడుదల చేయనుంది.
యాపిల్ ఐపాడ్ ఎయిర్ 2020 మోడల్ను ఆదర్శంగా తీసుకొని రియల్మీ కంపెనీ పాడ్ను తీసుకొస్తోంది. అయితే.. సరికొత్త ఫీచర్లతో రియల్మీ ఈ ట్యాబ్ను విడుదల చేస్తుండటంతో అందరి దృష్టి ప్రస్తుతం దీనిమీదే ఉంది.
10.4 ఇంచ్ స్క్రీన్, 82.5 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 6.9 ఎంఎం థిక్నెస్, 7100 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లతో రియల్మీ పాడ్ విడుదల కానుంది. ఫ్లిప్కార్ట్, రియల్మీ వెబ్సైట్, ఆఫ్లైన్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయొచ్చు.
సెప్టెంబర్ 9న రియల్మీ పాడ్తో పాటు కంపెనీ రియల్మీ 8ఎస్ సిరీస్ను విడుదల చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్తో ఈ ఫోన్ లభిస్తుంది. 6.5 ఇంచ్ డిస్ప్లేతో ఈ ఫోన్ విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Realme Pad : రియల్మీ నుంచి తొలి ట్యాబ్.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
Redmi Earbuds 3 Pro : 30 గంటల బ్యాటరీ లైఫ్తో రెడ్మీ ఇయర్బడ్స్ 3 ప్రో విడుదల