ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మీ 8 5G స్మార్ట్ఫోన్లో కొత్త వేరియంట్ను కంపెనీ లాంచ్ చేసింది. భారత్లో రియల్మీ 8 5జీ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ఫోన్ బ్లాక్, బ్లూ అనే రెండు కలర్లలో అందుబాటులో ఉంది.రియల్మీ 8 5G ఫోన్లలో 6.50 అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700ప్రాసెసర్, ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సెల్, రియర్ కెమెరా 48+2+2 మెగా పిక్సెల్, ర్యామ్ 4జీబీ, స్టోరేజ్ 64జీబీ వంటి స్పెసిఫికేషన్లు ఇందులో ఉన్నాయి.
భారత్లో బడ్జెట్ ధరలో విడుదలైన 5జీ స్మార్ట్ఫోన్ ఇదే. ఇటీవల రియల్మీ 8 5జీ ఫోన్ ధరను కంపెనీ రూ.500 తగ్గించింది. కొత్త వేరియంట్ ఫోన్లను ఇ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్, రియల్మీ డాట్కామ్ ద్వారా మే 18 నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. కొత్త వేరియంట్తో పాటు రియల్మీ 8 5జీ కూడా 4GB+128GB, 8GB+128GB కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉన్నాయి.