బెంగళూరు: కర్ణాటకలో అక్రమంగా నివాసం ఉంటున్న 38 మంది శ్రీలంకన్లను ఆ రాష్ట్ర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మంగళూరు నగరంలోకి వీరు అక్రమంగా ప్రవేశించారని పోలీస్ అధికారులు తెలిపారు. శ్రీలంకకు చెందిన 38 మంది ఈ ఏడాది మార్చి మధ్యలో తొలుత తమిళనాడుకు చేరుకున్నారని, తరువాత బెంగళూరుకు, అక్కడి నుంచి మంగళూరుకు వచ్చారని పోలీస్ కమిషనర్ శశి కుమార్ వివరించారు. వారికి ఆశ్రయం కల్పించి సహాయం చేస్తున్న ఆరేడు మంది స్థానికులను కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.