సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ జట్టు ఆధిక్యంలోకి వచ్చింది. తొలి ఇన్నింగ్స్లో 93 ఓవర్లకు కివీస్ 220/7తో మెరుగైనస్థితిలో నిలిచింది. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 217 పరుగులకే ఔటైన విషయం తెలిసిందే. ఆధిక్యం సాధించిన తర్వాత అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్(49: 177 బంతుల్లో 6ఫోర్లు) ఔటయ్యాడు.
ఇషాంత్ శర్మ వేసిన 94వ ఓవర్ ఆఖరి బంతిని షాట్ ఆడగా థర్డ్ స్లిప్లో విరాట్ కోహ్లీ చేతికి చిక్కాడు. తొలి సెషన్ నుంచి కేన్ అద్భుత పోరాటం చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ జట్టు స్కోరును ముందుండి నడిపించాడు. 96 ఓవర్లకు కివీస్ 8 వికెట్లకు 234 పరుగులు చేసింది. టిమ్ సౌథీ(23), వాగ్నర్ క్రీజులో ఉన్నారు. కివీస్ 17 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.