న్యూఢిల్లీ: తులం బంగారం ధర దేశీయ రాజధాని ఢిల్లీలో భారీగా పెరిగింది. గురువారం తులం బంగారం ధర రూ.881 పెరిగి రూ.44,701కి చేరుకున్నది. గోల్డ్ గ్లోబల్ మార్కెట్లో ధరల్లో రికవరీ సాధించడంతో దేశీయ మార్కెట్లో ధర మెరుగైందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపాయి. బుధవారం 10 గ్రాముల బంగారం రూ.43,820గా పలికింది. వెండి కూడా అదే బాటలో పయనించింది.
కిలో వెండిపై రూ.1071లు పెరగడంతో దాని ధర 63,256కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,719 అమెరికా డాలర్లు పలుకగా, ఔన్స్ వెండి ధర 24.48 డాలర్లుగా ట్రేడవుతోంది.
ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.500లకు పైగా పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ.46,370గా ఉంది. అలాగే, కిలో వెండి ధర రూ.65,969గా ఉంది. ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగడం వల్లే ధరలు పెరిగినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లకు బంగారం పెట్టుబడికి సురక్షితంగా భావిస్తున్నారని, అందుకే వాటి ధరలు పెరుగుతున్నాయని బులియన్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫ్యూచర్స్ మార్కెట్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ధర రూ.185 పెరిగి రూ.45,120కి చేరుకున్నది. జూన్ డెలివరీ ధర రూ.45,120గా నమోదైన తులం బంగారం ధర ఫ్రెష్ పొజిషన్కు చేరుకున్నది. అంతర్జాతీయంగా న్యూయార్క్లో ఔన్స్ బంగారం ధర 1,716.50 డాలర్లు పలికింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
బంపరాఫర్: సర్కారీ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్
ఇన్వెస్టర్లూ.. బీ వేర్: ఏప్రిల్లో 11 రోజులు సెలవులే!