దర్శనమిచ్చిన షవ్వాల్ నెలవంక
ముగిసిన ఉపవాసదీక్షలు
మహబూబ్నగర్టౌన్, మే 13: నెలవంక మెరిసింది. రంజాన్ పండుగ వచ్చేసింది. నెల రోజుల పాటు కఠోర ఉపవాసదీక్షలు కొనసాగించిన ముస్లింలు గురువారం సాయంత్రం దీక్షలు విరమించి శుక్రవారం రంజాన్ పండుగ జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. గురువారం రాత్రి మగ్రీబ్ నమాజ్ అనంతరం ఒకరికొకరు ఈద్ ముబాకర్ తెలుపుకొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈసారి ఈద్ నమాజ్ ఇంటి వద్దే చేసుకోవాలని మతపెద్దలు సూచించారు. ఉదయం 6గంటలను నుంచి 10 గంటల వరకు పండుగ షాపింగ్ చేశారు.