ఒప్పో స్మార్ట్ ఫోన్లు తెలుసు కదా. చైనాకు చెందిన ఈ మొబైల్ ఫోన్ బ్రాండ్.. ఇండియాలోనూ తన మార్కెట్ను బాగానే విస్తరించింది. ప్రముఖ టాప్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అయిన సామ్ సంగ్, జియోమీలకు గట్టి పోటీ ఇస్తూ.. రోజు రోజుకూ సరికొత్త ఫీచర్లను తమ ఫోన్లలో తీసుకొస్తోంది. వినియోగదారులను అకట్టుకునేందుకు.. ఏ మొబైల్ బ్రాండ్ చేయని ప్రయోగాలను ఒప్పో చేస్తోంది. అందులో భాగంగానే.. అండర్ డిస్ ప్లే పేరుతో ఫ్రంట్ కెమెరాలో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనికి Next- gen under screen camera(USC) అనే పేరు పెట్టింది. ఈ ఫీచర్ వల్ల స్క్రీన్ క్వాలిటీ, కెమెరా ఇమేజ్ క్వాలిటీని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవచ్చని ఒప్పో వెల్లడించింది.
ఈ ఫీచర్తో వచ్చిన ఫోన్లలో ఫ్రంట్ కెమెరా ఫోన్ స్క్రీన్తో పాటు కలిసిపోతుంది. అసలు.. ఫ్రంట్ కెమెరా ఉన్నట్టు కూడా కనిపించదు. ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి ఫోటోలు తీసినప్పుడు మాత్రమే.. చిన్న లైట్ వచ్చి పోతుంది. దీంతో ఫ్రంట్ కెమెరా వర్క్ చేస్తుందని భావించాలి. అందుకే దీనికి అండర్ స్క్రీన్ కెమెరా అని పేరు పెట్టారు.
అందుకే.. అండర్ డిస్ప్లే కెమెరా ఫీచర్ను డెవలప్ చేసిన ప్రోటోటైప్ను తాజాగా ఒప్పో విడుదల చేసింది. ఒప్పో లాగానే.. ఇతర ప్రముఖ మొబైల్ బ్రాండ్స్.. అండర్ డిస్ప్లే కెమెరా ఫీచర్ మీద ప్రయోగాలు చేస్తున్నా.. ఈ ఫీచర్ సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది. అయితే.. ఒప్పో మాత్రం ఈ ఫీచర్ విషయంలో విజయం సాధించినట్టే. ఇప్పటికే ఒప్పో రిలీజ్ చేసిన ప్రోటోటైప్ అద్భుతంగా పనిచేస్తోందని.. త్వరలోనే ఒప్పో నుంచి విడుదలయ్యే అన్నిస్మార్ట్ఫోన్లలో ఈ ఫీచర్ను యాడ్ చేస్తామని కంపెనీ ప్రకటించింది.
కెమెరా డిస్ప్లేలో ప్రతి పిక్సెల్ సైజ్ను తగ్గించడం నుంచి ట్రెడిషనల్ స్క్రీన్ బదులు పారదర్శక స్క్రీన్తో పాటు.. 1 టు 1 పిక్సెస్ సర్క్యూట్ డ్రైవింగ్ లాంటి ఆప్షన్లను అండర్ స్క్రీన్ కెమెరా ఫీచర్లో యాడ్ చేయనున్నారు. ఇప్పటి వరకు చైనాకు చెందిన జెడ్టీఈ అనే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మాత్రమే అండర్ డిస్ప్లే కెమెరా ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తన జెడ్టీఈ ఎక్సాన్ 20, జెడ్టీఈ ఎక్సాన్ 30 మోడల్స్లో ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ.. ఆ ఫోన్లలో ఆ ఫీచర్ సక్సెస్ కాలేదు. ఆ ఫీచర్ వల్ల ఇమేజ్ క్వాలిటీ దెబ్బతినడం, సెన్సార్ సరిగ్గా పనిచేయకపోవడం లాంటి సమస్యలు ఆ మోడల్స్లో వచ్చాయి.