కందుకూరు, మార్చి 14 : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రులకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీ దేవి విజయం ఖాయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం కందుకూరులోని పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్ సరళిని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టభద్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి కావల్సిన సదుపాయాలు, వసతులను ప్రభు త్వం కల్పిస్తుందని వివరించారు. ఓటింగ్ సరళిని బట్టి చూస్తే పట్టభద్రులు తమ వెంటే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులను కడుపులో పెట్టుకుంటుందని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెప్పే మాటలను పట్టభద్రులు నమ్మలేదని తెలిపారు. ఫలితాల అనంతరం ప్రతిపక్షాలు కనుమరుగవుతాయని వివరించారు. తమ పార్టీని ప్రజలు నమ్ముతున్నారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయమని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ వరలక్ష్మీ సురేందర్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని సురేందర్రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, ఎస్సీ విభాగం అధ్యక్షుడు చిర్ర సాయిలు, గుయ్యని సామయ్య, ఉపాధ్యక్షుడు సామ మహేందర్రెడ్డి, దామోదర్గౌడ్, ప్రధాన కార్యదర్శి మేఘనాథ్రెడ్డి, చంద్రశేఖర్, కృష్ణారాంభూపాల్రెడ్డి, వైఎస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, యువజన విభాగం వర్కింగ్ ప్రసిడెంట్ తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్రెడ్డి, ప్రశాంత్చారి, హన్మంత్రెడ్డి, యాదయ్య, సదానంద్గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.