OnePlus Nord CE 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వన్ప్లస్ నార్డ్ సిరీస్లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సమ్మర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ, వన్ప్లస్ టీవీ U1S ఎల్ఈడీ టీవీని భారత్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. నార్డ్ సిరీస్లో రిలీజ్కాబోతున్న రెండో ఫోన్ ఇదే. రాబోయే నార్డ్ సీఈ స్మార్ట్ఫోన్ కోసం ప్రీ-ఆర్డర్, ఓపెన్ సేల్ తేదీలను ప్రకటించింది.
జూన్ 11న వన్ప్లస్ కొత్త స్మార్ట్ఫోన్ను ముందుగా బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు రూ.2,699 విలువైన గిఫ్ట్లను అందజేయనున్నట్లు తెలిపింది. ఓపెన్ సేల్ జూన్ 16 నుంచి ఆరంభంకానుంది. ఈ ఫోన్ జూన్ 10న సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నారు.