ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వన్ప్లస్ గురువారం సాయంత్రం మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీని భారత్లో ఆవిష్కరించనుంది. కొత్త ఫోన్ లాంచ్కు ముందే మరో ప్రీమియం మోడల్ వన్ప్లస్ 8T(OnePlus 8T 5G) ధరను 4వేలు తగ్గించింది. గతేడాది అక్టోబర్లో వన్ప్లస్ 8టీని లాంచ్ చేయగా ఆసమయంలో ఫోన్ ప్రారంభ ధర రూ.42,999గా ఉంది. ఇప్పుడు ఆ మోడల్ను రూ.38,999కే కొనుగోలు చేయొచ్చు. తాజాగా ధర తగ్గింపుతో ఇప్పుడు వన్ప్లస్ 9R కన్నా 8T ఫోన్ చౌకగా లభించనుంది. వన్ప్లస్ 8టీ కొత్త ధరలు వన్ప్లస్ వెబ్సైట్తో పాటు అమెజాన్లో అప్డేట్ అయ్యాయి.
8టీ ఫోన్ స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.55 అంగుళాలు
ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 48+16+5+2 మెగా పిక్సెల్
ర్యామ్: 12జీబీ
స్టోరేజ్: 256జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 4500mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11