న్యూఢిల్లీ : గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ను ఫాలో అవుతానని జేఈఈ మెయిన్స్ టాపర్ రంజిమ్ ప్రభాల్ దాస్ తెలిపాడు. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 100 శాతం పర్సంటైల్ సాధించిన వారిలో ప్రభాల్ దాస్ స్థానం సంపాదించాడు. ఈ సందర్భంగా ఆ విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ, తాను చదువు మీద ఫోకస్ పెట్టానని పేర్కొన్నాడు. ఉన్నత విద్యను ఐఐటీ ఢిల్లీలో అభ్యసించాలనేది తన కోరిక అని స్పష్టం చేశాడు. ఒక వేళ ఐఐటీ ఢిల్లీలో అడ్మిషన్ లభించకపోతే ఐఎన్ఎస్సీ బెంగళూరులో చదువుతానని చెప్పాడు.
100 శాతం పర్సంటైల్ సాధించిన వారిలో రంజీమ్ ప్రభాల్ దాస్, ప్రవార్ కటారియా(ఢిల్లీ), గురమ్రిత్ సింగ్(చండీఘర్), సాకేత్ జా(రాజస్థాన్), సిధాంత్ ముఖర్జీ(మహారాష్ర్ట), అనంత్ కృష్ణ కిదాంబి(గుజరాత్) ఉన్నారు.