వాషింగ్టన్ : కరోనా పరీక్షలను ఇకపై సెకన్లో పూర్తిచేయవచ్చు. కరోనా వైరస్ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో పరిశోధకులు గొప్ప విజయాన్ని సాధించారు. వీరు కొత్త పోర్టబుల్ కొవిడ్-19 పరీక్ష కిట్ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా కేవలంసెకన్లోనే కరోనా వైరస్ను నిర్ధారించే పరీక్షలు జరిపేందుకు వీలుంటుందని పరిశోధకులు తెలిపారు. ఇందుకోసం సెన్సార్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. దీని సహాయంతో కరోనాకు కారణమయ్యే సార్స్-కొవ్-2 వైరస్ను సెకనులోనే గుర్తించవచ్చు. ఇప్పటికే ఉన్న పద్ధతులతో పోల్చితే ఇది వేగవంతమైన పరిశోధన పద్ధతిగా వర్ణిస్తున్నారు.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ సెన్సార్ మార్కెట్లో ఉన్న గ్లూకోజ్ టెస్ట్ స్ట్రిప్ట్తో సమానంగా ఉంటుంది. ఈ సెన్సార్తో పాటు చిన్న సైజు మైక్రోఫ్లూయిడ్ ఛానల్ ఉంటుంది. మైక్రోఫ్లూయిడ్ ఛానల్ లోపల కొన్ని ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వీటిలో ఒకదానికి బంగారు పూత ఉంటుంది. ద్రవ నమూనాలో కరోనా-సంబంధిత యాంటీబాడీ రసాయన పద్ధతి ద్వారా బంగారు ఉపరితలంపై అంటుకుంటుంది. ఈ విధంగా కరోనా ఇన్వెస్టిగేషన్కు తీసుకునే సమయాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.
ఈ సెన్సార్ సిస్టంను వాక్యూమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బీ జర్నల్లో ప్రచురించారు. ఈ పద్ధతి ద్వారా ఇతర వ్యాధులను కూడా గుర్తించవచ్చు అని ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన మింఘాన్ జియాన్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ పెరిగిన కొత్త కొవిడ్ కేసులు.. బ్రెజిల్లో 80 వేల కొత్త కేసులు
జీ-7 ఆరోగ్య మంత్రుల సమావేశానికి భారత్కు ఆహ్వానం
క్రికెటర్ భువనేశ్వర్ కుమార్కు పితృవియోగం
ఎన్నికల్లో అధిక ఖర్చుపై ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడిపై విచారణ
బ్లాక్ ఫంగస్ తర్వాత.. ఇప్పుడు వైట్ ఫంగస్ ఇబ్బందులు
అంటార్కిటికాలో అతిపెద్ద మంచుకొండ గుర్తింపు
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
ఈ-కామర్స్పై ఫిర్యాదు ఇక సులభం
బార్జ్ మునక : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేషణ
కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి.