కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల నేపథ్యంలో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆరు బహిరంగ సభలు, రోడ్షోలో పాల్గొనున్నారు. మొదట మధ్యాహ్నం 12:20 గంటలకు శాంతిపూర్లో రోడ్షో నిర్వహించనున్నారు. అనంతరం 1:30 గంటలకు రణఘాట్ సౌత్లో రోడ్షో, మధ్యాహ్నం 3.40గంటలకు బాసిర్హాట్ సౌత్లో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 04:25 గంటలకు పానిహతిలో రోడ్షోలో, సాయంత్రం 5:30 గంటలకు కమర్హతిలో టౌన్ హాల్ సమావేశం, రాత్రి 7:00 గంటలకు రాజర్హత్ గోపాల్పూర్ టౌన్ హాల్లో జరిగే మరో సమావేశంలో పాల్గొననున్నారు.
294 అసెంబ్లీ స్థానాలున్న వెస్ట్ బెంగాల్లో ఎనిమిది విడుతలుగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడుతల ఎన్నికలు పూర్తవగా.. 17న ఐదో విడుతలో 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. 22న ఆరో విడతలో 43 స్థానాలకు, 26న ఏడో విడుతలో 35 నియోజకవర్గాలకు, 29న చివరి విడతలో 35 నియోజకవర్గాలకు జరుగనున్నాయి. మే 2న ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించనుంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీగా సాగుతున్నాయి.
ఇరు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఎక్కడో ఒక చోట దాడులు, బాంబు పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. శనివారం నాలుగో విడుత ఎన్నికల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఘటనపై కేంద్ర హోంశాఖపై సీఎం మమత ఆరోపణలు గుప్పించారు. హోంమంత్రి అమిత్షా రాజీనామాకు డిమాండ్ చేశారు. హింసకు సీఎం మమతే కారణమని ప్రధాని ఆరోపించారు.