హన్మకొండ చౌరస్తా, ఏప్రిల్ 17: అత్యాధునిక స్టాప్లర్ పరికరంతో పైల్స్ శస్త్రచికిత్స చేయవచ్చని డాక్టర్ కూరపాటి రమేశ్ తెలిపారు. శనివారం హన్మకొండలోని కూరపాటి లేజర్ పైల్స్ క్లినిక్లో ‘మెడ్ ట్రానిక్’ సహకారంతో ఏఎస్ఐ-వరంగల్ బ్రాంచి సౌజన్యంతో పైల్స్కి అత్యాధునిక స్టాప్లర్ ఉపయోగించి శస్త్రచికిత్స చేయడంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ వర్క్షాప్ను వైద్యు లు గోపాల్రావు, మోహన్దాస్, సుధాకర్, వెంకన్న, అశోక్రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి రమేశ్ మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన ప్రాక్టాలజిస్ట్(పైల్స్, ఫిషర్, ఫిస్టుల ప్రత్యేక శస్త్రచికిత్సా నిపుణులు)కి వరంగల్లోని కూరపాటి దవాఖానలో శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో శిక్షణ పొందిన వైద్యులు దేశంలోని వివిధ రాష్ర్టాలు, గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక స్టాప్లర్ చికిత్స చేయడం ద్వారా శస్త్రచికిత్స ప్రయోజనాలను అందించిన వారవుతారని తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా పైల్స్తో బాధపడుతున్నవారికి స్టాప్లర్ పరికరాన్ని ఉపయోగించి శస్త్రచికిత్స చేయడంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.