హైదరాబాద్ : సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు నీరందించే సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులను ఈ నెల 12వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సర్వే పనులు 14 వ తేదీకి వాయిదా పడింది. మంత్రి హరీశ్ రావు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉన్నందున శనివారం నాటి సంగమేశ్వర లిఫ్ట్ సర్వే ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది.
కాగా, జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్ రావు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉన్నందున పనుల ప్రారంభోత్సవ కార్యక్రామాన్ని వాయిదా వేశారు. ఈ నెల 14 తేదీన (సోమవారం) 11 గంటలకు అదే ప్రాంతంలో మంత్రి హరీశ్ రావు సర్వే పనులను ప్రారంభిస్తారని అందోల్ ఎమ్మెల్యే చంట్రి క్రాంతి కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి..
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
ఆహారం వికటించి 41 మందికి అస్వస్థత
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన : మంత్రి సబిత