బ్రస్సెల్స్: అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందం పునరుద్ధరణలో అడుగు ముందుకు పడింది. తిరిగి ఒప్పందంలో చేరే ప్రక్రియలో భాగంగా తాము సంబంధింత దేశాలతో పరోక్ష చర్చలు జరుపనున్నట్టు అమెరికా, ఇరాన్ శుక్రవారం తెలిపాయి. ఇరాన్, పీ5, ఈయూ దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందం(జేపీసీవోఏ) నుంచి అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైదొలిగారు. బైడెన్ అధికారంలోకి వచ్చాక తాము తిరిగి ఒప్పందంలో చేరబోతున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఆస్ట్రియాలో ఈయూ దేశాలతో చర్చించనున్నట్టు అమెరికా పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
పట్టాలు తప్పిన రైలు 48మంది మృతి
అమెరికాను ప్రతిబింబిస్తున్న క్యాబినెట్: బైడెన్
‘గ్లోబల్ టీచర్’ మరియమ్మ కన్నుమూత