సంగారెడ్డి: జిల్లాలోని సదాశివపేట మండలం ఆత్మకూరులో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ చిన్నారుల ప్రాణాలమీదికి తీసుకువచ్చింది. ఇద్దరు కుమార్తెలకు పురుగుల మందు తాగించిన తండ్రి.. తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన శివకుమార్కు, అల్లాదుర్గం గ్రామానికి చెందిన మహిళతో వివాహం అయ్యింది. వారికి ఇద్దరు కూతుర్లు సిరి, నవ్యశ్రీ (4) ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా.. శివకుమార్ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి తన తల్లిగారి ఇంటి వద్ద ఉంటున్నది. కాగా, నిన్న సాయంత్రం అల్లాదుర్గం వెళ్లిన శివకుమార్ తన ఇద్దరు కూతుర్లను సదాశివపేటకు తీసుకువచ్చాడు. రాత్రి ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని గుర్తించిన బంధువులు సంగారెడ్డి జిల్లా దవాఖానకు తరలించారు. అయితే వారిని పరిశీలించిన డాక్టర్లు చిన్న కుమార్తె నవ్యశ్రీ అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. శివకుమార్, పెద్ద కుమార్తె సిరి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం శివకుమార్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, శివకుమార్ సూసైడ్ నోట్ రాసినట్లుగా తెలుస్తున్నది. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి అత్మహత్యకుగల కారణాలు తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..