జియోమీ తాజాగా నిర్వహించిన స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్లో భాగంగా.. ఎంఐ నోట్బుక్ లాప్టాప్ సిరీస్లను విడుదల చేసింది. ఈ ఈవెంట్లో ఎంఐ టీవీ 5ఎక్స్, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6ను కూడా రిలీజ్ చేసింది.
ఎంఐ బ్రాండ్లో 14 హారిజాన్ ఎడిషన్ కింద వీటిని రిలీజ్ చేశారు. 11th Gen ఇంటెల్ కోర్ ప్రాసెసర్, ఇంటెల్ ఐరిష్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ కార్డుతో ఈ లాప్టాప్స్ విడుదల అయ్యాయి.
15.6 ఇంచ్ ఎంఐ నోట్బుక్ ఆల్ట్రా, 14 ఇచ్ ఎంఐ నోట్బుక్ ప్రోమో మోడల్స్ను ఎంఐ లాంచ్ చేసింది. ఇవి బ్యాక్లైట్ కీబోర్డ్, 16:10 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉంటాయి.
ఎంఐ నోట్బుక్ అల్ట్రా మోడల్ లాప్టాప్ ధర రూ.59,999 కాగా.. దీని కాన్ఫిగరేషన్స్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ను కలిగి ఉంటుంది. రూ.63,999 తో కోర్ ఐ5 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్ను కలిగి ఉంటుంది. ఒకవేళ ఐ7 ప్రాసెసర్ కావాలంటే.. మాత్రం 16 జీబీ ర్యామ్ ప్లస్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్తో రూ.76,999 ధర ఉంటుంది.
ఎంఐ నోట్బుక్ ప్రో కాన్ఫిగరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్తో కలిపి రూ.56,999 కాగా.. కోర్ ఐ5 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.59,999, ఇక.. టాప్ఎండ్ కోర్ ఐ7 ప్లస్ 16 జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.72,999 గా ఉంది.
ఆగస్టు 31 నుంచి ఎంఐ నోట్బుక్ అల్ట్రా, ప్రో లాప్టాప్స్ సేల్ ప్రారంభం కానుంది. ఎంఐ వెబ్సైట్, అమెజాన్, ఎంఐ హోమ్ స్టోర్స్లో లాప్టాప్ను కొనుగోలు చేయొచ్చు. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ద్వారా రూ.4500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.