ప్రమాదకరంగా మూల మలుపు, కల్వర్టు
సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికుల వినతి
దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామ సమీపంలో గల ప్రధాన రహదారిపై మూల మలుపు వద్ద కల్వర్టు ప్రమాదకరంగా మారింది. ఈ చెట్ల పొదలు ఏపుగా పెరగడంతో కల్వర్టు కనిపించకుండా పోయింది. ఇక్కడ సూచిక బోర్డులు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ రోడ్డుపై జన్నారం, కడెం, జగిత్యాల జిల్లాకు ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మూల మలుపు, కల్వర్టు వద్ద చెట్ల పొదలు తొలగించాలని, సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇవి కూడా చూడండి..
ప్రజాసేవ కోసం.. సినిమాలు వదిలేస్తా: కమల్ హాసన్
వకీల్ సాబ్ ఫస్ట్ డే టికెట్ బుకింగ్స్ ఖతం