మహీంద్ర అండ్ మహీంద్ర ఆటోమొబైల్ కంపెనీ తాజాగా బ్రాండ్ న్యూ లోగోను ఆవిష్కరించింది. త్వరలో రాబోయే ఎస్యూవీ మోడల్స్ అన్నీ ఇదే లోగోతో విడుదల కానున్నాయి. మహీంద్ర ఎక్స్యూవీ 700 ప్రీమియం ఎస్యూవీ వెహికిల్ కొత్త లోగోతోనే మార్కెట్లో విడుదల కానుంది.
ప్రస్తుతం ఉన్న మహీంద్ర లోగోను 2000 సంవత్సరంలో ఆవిష్కరించారు. 2002 లో స్కార్పియోతో ఆ లోగోను మార్కెట్లో విడుదల చేశారు. ఎమ్ అనే అక్షరాన్ని సిగ్నిఫై చేసే విధంగా కొత్త లోగోను తీర్చిదిద్దారు.
ఇది కొత్త లోగో మాత్రమే కాదు.. మహీంద్ర కంపెనీ బ్రాండ్కు అది ప్రతీక. ఎక్స్యూవీ 700 లాంటి బెస్ట్ కారుతో ఈ లోగో మార్కెట్లోకి రావడం అంటే.. ఇంతకన్నా బెస్ట్ చాన్స్ మళ్లీ రాదు.. అని మహీంద్ర ఆటోమేటివ్ డివిజన్ సీఈవో వీజయ్ నక్రా వెల్లడించారు.
ఇక.. న్యూ జనరేషన్ ఎక్స్యూవీ 700 ఈసంవత్సరమే రిలీజ్ కానుంది. సరికొత్త డబ్ల్యూ 601 ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని ఈ సరికొత్త వెహికల్ను మహీంద్ర తయారు చేసింది. ఇందులో రెండు ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 2.0 లీటర్ పెట్రోల్ మోటర్, 2.2 లీటర్ డీజిల్ యూనిట్.
అలాగే.. స్మార్ట్ ఫిల్టర్ టెక్నాలజీ, అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, క్లయిమెట్ కంట్రోల్, వైర్ లెస్ చార్జింగ్, ట్విన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, డ్రైవర్ అటెన్షన్ డిటెక్షన్ లాంటి సరికొత్త ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.