భోపాల్ : కరోనా రోగులకు ఉపశమనం కలిగించే మందులతో పాటు వ్యాక్సిన్ కొరత దేశాన్ని వెంటాడుతోంది. ఉన్న కొద్దిపాటి మెడిసిన్స్ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ ఇండోర్లోని భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ కంపెనీలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కంపెనీ గోడౌన్లో నిల్వ ఉంచిన కరోనా మెడిసిన్స్, వ్యాక్సిన్తో పాటు బ్లాక్ ఫంగస్కు ఉపయోగించే మందులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదం వల్ల రూ. 25 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు కంపెనీ యాజమాన్యం ప్రాథమికంగా నిర్ధారించింది.