హైదరాబాద్ : కరోనా వైరస్ బారిన పడి టీఎస్ఎండీసీ జనరల్ మేనేజర్ దీప్తి మృతి చెందారు. హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2007లో గ్రూప్ 1 ద్వారా ఆడిట్ అధికారిగా ఎంపికై, ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ హోదాలో టీఎస్ఎండీసీ జనరల్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ 1992లో ఐఎస్ఐ ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జీ కృష్ణ ప్రసాద్ కుమార్తె దీప్తి.
దీప్తి మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ కార్యాలయాల్లో ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు . ఆమె మృతి పట్ల ఆడిట్ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావు, జాయింట్ డైరెక్టర్స్ ద్రాక్షాయిణి, ఇందిరా , ఆడిట్ ఉద్యోగ సంఘం నాయకులు రవి ప్రసాద్, వెంకటేశం , రేవతి , కృపాకర్ , రామదాసులు సంతాపం తెలిపారు.