ముంబై: భారతదేశపు అత్యంత విశ్వసనీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐటెల్ 4G స్మార్ట్ఫోన్పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐటెల్ A23 Pro పేరుతో విడుదలైన స్మార్ట్ఫోన్ను రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, మైజియో స్టోర్లు, రిలయన్స్ డిజిటల్డాట్ఇన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. జూన్ 1 నుంచి ఐటెల్ ఏ23 ప్రొ ఫోన్ విక్రయాలు దేశవ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. ఇంతకుముందు ఫోన్ ధర రూ.4,999 కాగా, జియో యూజర్లకు ఇప్పుడు రూ.3,899కే లభించనుంది. ఈ ఫోన్ సఫైర్ బ్లూ, లేక్ బ్లూ కలర్లలో అందుబాటులో ఉంది. క్వాడ్కోర్ 1.4 GHz ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ రామ్, 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, సాఫ్ట్ ఫ్లాష్ కలిగిన వీజీఏ సెల్ఫీ కెమెరా, రెండు సిమ్ స్లాట్లు ఉన్నాయి.