న్యూఢిల్లీ: బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. తన బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ను లోక్సభలో పార్టీ లీడర్గా స్పీకర్ ఓం బిర్లా గుర్తించడాన్ని హైకోర్టులో చిరాగ్ సవాల్ చేశారు. విచారణ జరిపిన జస్టిస్ రేఖ పల్లి, ఈ పిటిషన్కు ఎటువంటి అర్హత లేదన్నారు. చిరాగ్కు జరిమానా విధించాలని కోర్టు భావించిందని, అయితే ఆయన తరుఫు న్యాయవాది విన్నపం మేరకు జరిమానా విధించలేదని తెలిపారు. కాగా, ఐదుగురు పార్టీ ఎంపీల మద్దతుతో ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన పశుపతి కుమార్ పరాస్ ఈ నెల 7న జరిగిన మెగా కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఫుడ్ ప్రొసెసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.