చాలామంది ఇన్స్టాగ్రామ్ను ఫోన్లలోనే వాడుతుంటారు. అది ఫోటో, వీడియో షేరింగ్ యాప్. స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిట్, ఐవోఎస్ ఓఎస్లలో ఈ యాప్ను ఎక్కువగా వాడుతుంటారు. కొందరు డెస్క్టాప్ లేదా లాప్టాప్లోనూ ఇన్స్టాగ్రామ్ను వాడుతుంటారు. కాకపోతే.. పీసీలో ఇన్స్టాగ్రామ్ను వాడేవాళ్లు కేవలం.. ఫీడ్ను మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. డెస్క్టాప్ నుంచి ఫోటోలు కానీ.. వీడియో కానీ అప్లోడ్ చేసే అవకాశం ఉండదు.
ఒకవేళ.. డెస్క్టాప్ నుంచి మీడియా ఫైల్స్ అప్లోడ్ చేయాలంటే.. ఖచ్చితంగా థర్డ్ పార్టీ యాప్స్ సాయం తీసుకోవాల్సి వచ్చేది. అందుకే.. ఆ సమస్యకు ఇన్స్టాగ్రామ్ చెక్ పెట్టేసింది. ఇక నుంచి థర్డ్ పార్టీ యాప్స్ సాయం అవసరం లేకుండా డైరెక్ట్గా పీసీలోనే ఇన్స్టాగ్రామ్ నుంచి ఫోటోలు అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కోసం ఇన్స్టా యూజర్లు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఇన్స్టాగ్రామ్ ఆ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
డెస్క్టాప్లో ఇన్స్టాగ్రామ్ను ఓపెన్ చేశాక.. టాప్ రైట్ కార్నర్లో ప్లస్(+) సింబల్ కనిపిస్తుంది. ఆ సింబల్ను క్లిక్ చేసి మీడియా ఫైల్స్ను అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే.. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్లో ఉంది. బీటా వర్షన్ను మాత్రమే రిలీజ్ చేశారు. కొందరు యూజర్లకు మాత్రమే ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. త్వరలోనే అందరు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని ఇన్స్టాగ్రామ్ ప్రకటించింది.