రామంతాపూర్,జూన్ 28 : వరద ముంపు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. సోమవారం రామంతాపూర్ పెద్ద చెరువును అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని పెద్ద చెరువు చుట్టూ ఉన్న కాలనీలలో వరదనీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువులో వాటర్ లేవల్ను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. అవసరమైతే మోటారు పంపులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. గత సంవత్సరం పడిన వర్షాల వల్ల పలు కాలనీల ప్రజలు వరదనీటిలో మునిగి ఇబ్బందులు పడ్డారన్నారు. ఈకార్యక్రమంలో ఈఈ నాగేందర్, ఇరిగేషన్ డీఈ ఈ. పవన్, ఏఈ పృథ్వీ, టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, కంచర్ల సోమిరెడ్డి, జయచంద్రారెడ్డి, గడ్డం ఉపేందర్, నగేశ్, అంజిత్రెడ్డి, వెల్లంకి రవీందర్రెడ్డి, మహేందర్, బాలవెంకట్, అనిల్, కృష్ణారెడ్డి, జేసీబీ రాజు, సూరం శంకర్ తదితరులు పాల్గొన్నారు.