కట్టంగూర్ : పంచాయతీ ట్రాక్టర్ను లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ ఇంజిన్ తునాతునకలై డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఐటిపాముల వద్ద 65వ నెంబర్ జాతీయరహదారిపై మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. ఐటీపాముల గ్రామంలో హరితహారం మొక్కలకు నీళ్లు పోసేందుకు పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ రామమల్లు(49) ఉదయం పంచాయతీ పరిధిలోని మార్తవారిగూడెం వెళ్లి ట్యాంకర్లో నీళ్లు నింపుకున్నాడు.
తిరుగు ప్రయాణంలో సర్వీస్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ వేగంగా ట్రాక్టర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ తునాతునకలై డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.