ఇక ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఆటోమొబైల్ రంగంలో పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహనాలు రోడ్ల మీద తిరిగాయి. ఇక నుంచి.. ఎలక్ట్రిక్ వాహనాల జోరు ఇండియాలో మొదలైంది. దీంతో.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం వాహనదారులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో పలు ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసినప్పటికీ.. అవి అంతగా వాహనదారులను ఆకట్టుకోలేకపోయాయి.
అయితే.. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటడంతో ఇక.. ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అందుకే.. పలు కంపెనీలు.. పోటాపోటీగా ఎలక్ట్రిక్ బైక్స్ను లాంచ్ చేస్తున్నాయి. ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ కంపెనీలు.. ఎలక్ట్రిక్ బైక్లను ఇండియా మార్కెట్లోకి రిలీజ్ చేశాయి.
ఓలా ఎస్1, ఎస్1 ప్రో.. పేరుతో రెండు మోడల్స్ను రిలీజ్ చేసింది. సింపుల్ ఎనర్జీ కంపెనీ.. సింపుల్ వన్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది.
అయితే.. ఇప్పటికే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ బుకింగ్స్లో దూసుకుపోతోంది. ఇప్పటికే 30 వేలకు పైగా ప్రీ బుకింగ్స్ వచ్చినట్టు కంపెనీ తాజాగా ప్రకటించింది. అసలు.. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఎలా బుక్ చేసుకోవాలి? దాని కోసం ఎంత ఎమౌంట్ పే చేయాలి? డెలివరీ సమయంలో ఎంత పే చేయాలి? స్కూటర్ను ఎప్పుడు డెలివరీ చేస్తారు.. లాంటి విషయాల్లో కొందరు వినియోగదారులకు డౌట్స్ ఉన్నాయి. వాటిని తీర్చే ప్రయత్నమే ఈ కథనం.
సింపుల్ వన్.. బైక్ను బుక్ చేసుకోవాలని అనుకునే వాళ్లు.. https://www.simpleenergy.in/ అనే వెబ్సైట్లోకి వెళ్లి.. అక్కడ పైన ఉన్న PRE-BOOK అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దీంతో మరో పేజి ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు నచ్చిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో స్టెప్ ఉంటుంది. అక్కడ మీ లొకేషన్, మీ సిటీ, పిన్ కోడ్, పేరు, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ లాంటి వివరాలు ఇచ్చి Proceed and Pay for Booking అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడే పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్స్ ఆప్షన్ ద్వారా రూ.1947 పే చేసి.. స్కూటర్ను బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ.. తర్వాత మీకు ఆ స్కూటర్ వద్దనుకుంటే.. డెలివరీ కాకముందే.. ఆ ఆర్డర్ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీంతో మీరు పే చేసిన రూ.1947 డబ్బులను కంపెనీ తిరిగి చెల్లిస్తుంది. అంటే మీరు పే చేసే డబ్బులు.. రిఫండబుల్ అన్నమాట.
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను ఎక్స్ షోరూమ్ ప్రైస్.. రూ.1.10 లక్షలుగా నిర్ణయించారు. ఈ స్కూటర్కు 4.8 కిలోవాట్స్ బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈకో మోడ్లో 203 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఐడియల్ మోడ్లో అయితే.. 236 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
ప్రస్తుతానికి ఇండియాలో 13 రాష్ట్రాల్లో మాత్రం మొదటి ఫేజ్ కింద సింపుల్ వన్ స్కూటర్ను డెలివరీ చేస్తారు. వచ్చే నాలుగు నెలల్లో ఇండియా వ్యాప్తంగా సుమారు 300 కు పైగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సింపుల్ ఎనర్జీ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.