ఖమ్మం, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లాలో ఆక్సిజన్కు కొరత తీర్చేందుకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రంగలోకి దిగారు. ఆక్సిజన్ సరఫరా చేసేలా సారపాకలోని ఐటీసీ యాజమాన్యాన్ని ఒప్పించారు. రోజూ 5 మెట్రిక్ టన్ను ల సామర్థ్యం గల ఆక్సిజన్ ట్యాంకర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలకు అందించేలా ఏర్పాటుచేశారు. గురువారం ఖమ్మం జిల్లా ప్రధాన దవాఖానలో ఆక్సిజన్ ట్యాంకర్ను ప్రారంభించారు. అంతకుముందు ఖమ్మం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదని, అవసరాన్ని బట్టి డిమాండ్ మేరకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.