దేశీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్( Flipkart ) ఎలక్ట్రానిక్స్ సేల్( Flipkart Electronics Sale ) పేరుతో మరోసారి వినియోగదారుల ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్ సేల్లో ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లకు చెందిన మొబైల్స్పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ సేల్ మే 21 వరకు కొనసాగనుంది. రియల్మీ ఫోన్లు, మోటోరోలా, శాంసంగ్ తదితర ఫోన్లపై తగ్గింపును ప్రకటించింది. రియల్మీ ఎక్స్7 ప్రొ 5జీ, రియల్మీ ఎక్స్7 5జీ, మోటో జీ10 పవర్, రియల్మీ ఎక్స్50 ప్రొ 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62,
మోటో రేజర్ 5జీ, అసుస్ రోగ్ ఫోన్ 3 తదితర మోడళ్లపై డిస్కౌంట్ వర్తించనుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్ ఉంది. రోగ్ ఫోన్ 3పై 5వేల వరకు తగ్గింపు అందిస్తోంది.